11/19/16

ఎన్టీఆర్,అల్లుఅర్జున్ లతో పూరి మల్టీస్టారర్ మూవీ


తెలుగు తెరపై మరో భారీ మల్టీ స్టారర్‌కు తెర లేవనుందా? ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారా? దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందట.
ఇప్పటికే సాయిధరమ్‌, కల్యాణ్‌ రామ్‌ కలయికలో ఓ మల్టీస్టారర్‌ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్‌ హీరోల కలయిక వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీయార్‌, బన్నీకి వినిపించాడట పూరి. ఈ లైన్‌ ఆ హీరోలకు బాగా నచ్చిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

No comments: