11/14/16

గూగల్ మ్యాప్స్ లో చాలా useful ఫీచర్స్ ఉన్నాయి



గూగల్ మ్యాప్స్ అనేది చాలా పవర్ ఫుల్ మాపింగ్ సిస్టం. దీనిలో చాలా useful ఫీచర్స్ ఉన్నాయి. కాని కేవలం లొకేషన్ ఫైండింగ్ మరియు రౌటింగ్ మ్యాప్స్ తప్పితే మరేమీ చాలా మందికి తెలియవు. ఇక్కడ అవేంటో చూడండి..
Image result for google maps


MY maps సహాయంతో పెర్సనల్ మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు..
ఇది ఫ్రెండ్స్ మరియు ఫెమిలిస్ కు షేర్ చేయటానికి useful. క్రియేట్ చేయటానికి google.com/mymaps లింక్ లోకి వెళ్లి మీ గూగల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు క్రియేట్ మ్యాప్ అండ్ ఓపెన్ మ్యాప్ అని రెండు ఆప్షన్స్ లో క్రియేట్ పై క్లిక్ చేయండి.

Start by naming your personal map by clicking the “Untitled map” heading at the top left > Enter a name and/or description > Save.

ఇప్పుడు “Add layer” పై క్లిక్ చేసి personalise చేయటం మొదలుపెట్టండి. సెర్చ్ bar లో మీకు కావలసిన మ్యాప్ మార్కింగ్ ను ఎంటర్ చేసి మార్క్ చేయండి. సర్చ్ bar క్రింద customise ఆప్షన్స్ ఉంటాయి.

To start with, search for a place that you want to mention in your map, select “Add marker” from the tools and click on your place. Click on the marker to change the colour.



Multiple Layers ను వాడుకోగలరు..
each లేయర్ markers అండ్ డ్రాయింగ్స్ ను గ్రౌప్స్ గా చేస్తుంది. ఒక్కొక్క లేయర్ ను సిమిలర్ marker టైప్ తో assign చేయగలరు. ఫర్ eg మీకు షాపింగ్ మాల్స్ ను denote చేయాలని ఉంటే, షాపింగ్ మాల్స్ లేయర్ లో యాడ్ చేయగలరు. Individual styles use చేసి లేయర్స్ ను personalise చేయవచ్చు.

డ్రైవింగ్ డైరెక్షన్ ను ప్రోవైడ్ చేయగలరు marker కు..
మీ marker తో denote చేసిన ప్లేస్ కు డ్రైవింగ్ డైరెక్షన్స్ ఇవ్వటానికి click on your marker > “Directions to here”. వద్దకు వెళ్ళండి.



My Map ను ఈవెంట్ denote చేయటానికి వాడుకోగలరు..
ఫెస్టివల్ లేదా ఈవెంట్ యొక్క డిటేల్స్ మీ డ్రైవింగ్ మ్యాప్ లో ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు custom మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కాబట్టి మీరు దానినే ఈవెంట్ మాపింగ్ కు కూడా వాడవచ్చు. ఈవెంట్ లొకేషన్ ను డిఫరెంట్ డేస్ కు మాపింగ్ చేసేటప్పుడు లేయర్స్ బాగా use అవుతాయి. ఇది ఈజీ అండ్ understanding గా ఉంటుంది.

My maps లో మీ అడ్రస్ ను పిన్ చేయగలరు..
మీ కాంటాక్ట్స్ అడ్రెస్స్ బుక్ లో address అనే ఫీల్డ్ ఉంటే మ్యాప్ లో ఆ వ్యక్తులను పిన్ చేయగలరు ఈజీగా. ఇది వారి అడ్రెస్ కు visual representation ఇస్తుంది. ఇందుకు మీ అడ్రెస్ బుక్ ను XLSV లేదా CSV ఫార్మాట్ లో export చేయాలి. Then, create a New Map > Import > Select the file from your computer.

ఒకసారి సెలెక్ట్ చేసి అప్ లోడ్ చేసిన తరువాత address కాలమ్ field ను choose చేయమని అడుగుతుంది. అంతే ఇక ఆటోమేటిక్ గా గూగల్ మ్యాప్స్ ప్లేసెస్ ను పిన్ పాయింట్ చేస్తుంది మ్యాప్స్ లో.

మీ పర్సనల్ మ్యాప్ ను embed చేయటానికి..
మీరు క్రియేట్ చేసిన పర్సనల్ మ్యాప్ ను ఈజీగా మీ వెబ్ సైట్ లేదా ఈమెయిలు లో జోడించటానికి.. పర్సనల్ మ్యాప్ ఓపెన్ చేసి, లెఫ్ట్ panel లో లేయర్స్ వద్ద కు వెళ్లి Share > Embed on my site > copy the HTML tag provided and paste it where you want.



ఆఫ్ లైన్ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి?
మిగిలిన maps వలె గూగల్ entire డేటా బేస్ ను ఆఫ్ లైన్ చేయటానికి అనుమతించదు. కానీ ఒక particular ఏరియా ను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ లేనప్పుడు (ఆఫ్ లైన్) వాడుకోగలరు. మీ ఫోనులో మ్యాప్స్ ను డౌన్లోడ్ చేయటానికి... “Download” located at the right of the page > mark the area you want to include > Download > give an appropriate name > Save.

మరొక పద్దతి ఉంది ఆఫ్ లైన్ maps డౌన్లోడ్ చేయటానికి... go to side menu > Offline areas > Tap the “+” button > select an area > Download.



Time ట్రావెల్ అంటే తెలుసా?
ఓల్డ్ ఫోటో డేటా బేస్ ను పెట్టి గూగల్ time ట్రావెల్ ను యాడ్ చేసింది maps కు. ఇది స్ట్రీట్ view లో ఒక పార్ట్. అంటే ఏదైనా పాపులర్ ప్లేస్ ఏ ఇయర్ లో ఎలా ఉండేది అని చూడగలరు. లిమిటెడ్ డేటా బేస్ కారణంగా ఇది పాపులర్ ప్లేసెస్ కు మాత్రేమే ఉంది. టైం ట్రావెల్ ట్రై చేయటానికి.. (ex. London Eye) > See inside > click on the clock icon followed by a date located at the top left corner.

Map హిస్టరీ modify..
గూగల్ మీ మ్యాప్స్ activities ను ట్రాక్ చేసి ఉంచుతుంది. అంటే మీరు లొకేషన్ ఆన్ చేసి ఉండగా ఎటువంటి ప్రదేశాలు తిరిగారు ఏమి సెర్చ్ చేశారు వంటివి కూడా ఉంటాయి. వీటిని డిలీట్ చేయగలరు. ఇందుకు .. click on the side menu > Settings > Maps history. Click on the X button next to the entry that you want to delete and hit Delete.

FPS gamer వలె మ్యాప్స్ ను వాడుకోగలరు..
స్ట్రీట్ view తో రోడ్ పై నడవటానికి గూగల్ కీ బోర్డ్ షార్ట్ కట్స్ ను ఇచ్చింది. ఎప్పుడూ ఉండే arrow కీస్ తో పాటు WASD keys ఉన్నాయి. ముందుకు వెళ్ళటానికి w, వెనక్కి S లెఫ్ట్ కు A మరియు రైట్ కు D కీలను ప్రెస్ చేయగలరు.

Timeline ఉందని తెలుసా?
మీరు visit చేసిన ప్లేసెస్ ను ట్రాక్ చేసి, ఆ డేటా ను అంతా systematically ప్రెసెంట్ చేసి timeline form లో చూపిస్తుంది. ఇది చూడటానికి.. click on the side menu > Your timeline. You can also add, remove or edit a place manually to your timeline.



God Mode ను వాడుకోగలరు..
గూగల్ మ్యాప్స్ గూగల్ earth తో integrate అయ్యి వస్తుంది. దీనితో maps మరియు satellite imagery లను చూడగలరు. వీటిలో ఉన్న ఇంటరెస్టింగ్ విషయం God మోడ్. మీరు గూగల్ earth satellite imagery లో కి షిఫ్ట్ అయితే Tilt the view అనే ఐకాన్ చూడగలరు రైట్ సైడ్. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడికైనా ఎగరేలా పనిచేస్తుంది. దీనిని మరింత కూల్ గా వాడుకోవటానికి CRTL బటన్ ను hold చేసి మౌస్ తో axis ను moove చేయగలరు. అంటే virtual గా god-like జర్నీ చేయవచ్చు earth పై. అలాగే ఏదైనా బిల్డింగ్ పై క్లిక్ చేసి దాని ఇన్ఫర్మేషన్ పొందగలరు.

రియల్ టైమ్ ట్రాఫిక్ చూడండి..
ఇది బెస్ట్ ఫీచర్ ప్రస్తుత ట్రాఫిక్ ను దృష్టిలో తీసుకుంటే. అయితే ఇది historical డేటా పై base అయిన typical ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, రియల్ time data కాదు. ఇందుకోసం లైవ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ను యాడ్ చేసి accurate ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది గూగల్. లైవ్ ట్రాఫిక్ కొరకు ... click on the burger menu > Traffic. వెళ్లి బాటం సెంటర్ లో కనిపించే typical అండ్ లైవ్ ట్రాఫిక్ .. రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేయగలరు.



గూగల్ మ్యాప్స్ ను మీ డైరెక్షన్స్ ను predict చేయనివచ్చు..
ఆండ్రాయిడ్ లో రీసెంట్ అప్ డేట్ గా డ్రైవింగ్ మోడ్ వచ్చింది. ఇది ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ పై పనిచేసి మీ ప్రివియస్ సర్చేస్ లేదా ఆ రోజు time బట్టి మీరు వెళ్లదలుచుకున్న ప్లేస్ కు డైరెక్షన్స్ predict చేస్తుంది. అయితే ఇది U.S, United Arab Emirates, Great Britain, Ireland, Malaysia, New Zealand, and Singapore వారికే పనిచేస్తుంది. ఇండియాకు త్వరలో రానుంది. ఇది access చేయటానికి డ్రైవింగ్ మోడ్ షాట్ కట్ ను మీ ఫోన్ హోమ్ స్క్రీన్ పై లాంగ్ ప్రెస్ చేసి యాడ్ చేయాలి. homescreen > Android widgets > select Google Maps driving shortcut. To access from the Maps app go to menu > select “Start Driving’.

last buses మరియు ట్రేయిన్స్ ను మిస్ అవకండి..
maps లో హిడెన్ గా ఉండే ఈ ఫీచర్ particular రూట్ లో లాస్ట్ ట్రెయిన్ అండ్ bus ఏ time కు ఉందో తెలియజేస్తుంది. ఇందుకు destination సెట్ చేసి, ట్రెయిన్ ఐకాన్ ను సెలెక్ట్ చేసి, సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేస్తే Last అనే ఆప్షన్ కనిపిస్తుంది.

indoor మాప్స్ వాడుకోగలరు..
ఇది కూడా చాలా మందికి తెలియదు.. అయితే indoor maps selected లోకేషన్స్ లోనే ఉంది. ఎక్కడ ఉందో ఈ లింక్ లోని లిస్ట్ లో చూడగలరు..

Lite మోడ్ ను వాడుకోండి ఇలా..
మీ సిస్టం తక్కువ config తో ఉండే maps ను Lite వెర్షన్ లో కూడా వాడుకోవటానికి గూగల్ క్లాసిక్ maps ను ఇస్తుంది. దీనిలో 3d బిల్డింగ్స్, కరెంట్ లొకేషన్, etc ఉండవు. ఈ లింక్ లోకి వెళ్లి force గా maps ను lite మోడ్ లోకి షిఫ్ట్ చేయగలరు.

ఈ వాయిస్ కమెండస్ ను ట్రై చేయుండీ.. voice commands

Ok Google, next step
Ok Google, what’s my next turn
Ok Google, unmute
Ok Google, when will I get there
Ok Google, find gas stations
Ok Google, exit navigation
Ok Google, resume navigation
Ok Google, show route overview
Ok Google, Show alternate routes

మీరు వెళ్తున్న రూట్ లో రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్స్ etc ఇలా తెలుసుకోండి..
మీరు maps ను ఎక్కువుగా వాడేవారు అయితే maps లో మీరు వేల్తున్న రూట్ లో ప్లేసెస్ ను వెతకటానికి ఎంత ఇబ్బంది కరంగా ఉండేదో తెలిసి ఉంటుంది ఆల్రెడీ. నేవిగేషన్ ఆపి, ప్లేస్ వెతికి మళ్ళీ నేవిగేషన్ మొదలు పెట్టాలి మొదటి నుండి. కాని లేటెస్ట్ అప్ డేట్ లో allow for పిట్ stops ఫీచర్ ను అందించింది నేవిగేషన్ మోడ్ లో. ఇది వాడటానికి మీరు నేవిగేషన్ లో ఉన్నప్పుడు ఫ్లోటింగ్ సర్చ్ బటన్ పై ప్రెస్ టచ్ చేస్తే, పెట్రోలియం స్టేషన్స్, రెస్టారెంట్స్, grocery స్టోర్స్, కాఫీ షాప్స్ అండ్ custom ప్లేస్ వెతకటానికి సర్చ్ బటన్ ఇస్తుంది maps.

ప్రధాని మోదీ భావోద్వేగ విన్నపం

నన్ను ప్రాణాలతో ఉండనివ్వరేమో!.. ఐనా జంకను
నిలువునా దహించినా.. నల్ల ధనంపై పోరు ఆపను!
దేశం కోసం ఓపికపట్టండి.. 50 రోజుల్లో ఫలితాలు
నా నిర్ణయంలో దురుద్దేశం ఉందని తేలితే.. క్షమించకండి!
ప్రధాని మోదీ భావోద్వేగ విన్నపం
పెద్దనోట్ల రద్దు అంతంకాదు... ఆరంభమే!.. మున్ముందు మరిన్ని చర్యలు
బినామీ ఆస్తుల గుట్టూ రట్టు చేస్తా.. 70 ఏళ్ల అవినీతి చరిత్ర తవ్వితీస్తా
నిజాయితీపరులను ఇబ్బందిపెట్టం.. అవినీతిపరులెవ్వరినీ వదిలిపెట్టం
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు నిజమే.. ఇది అహంకార నిర్ణయం కాదు
గద్దెపైకెక్కేందుకు పుట్టలేదు.. దేశం కోసం సర్వం వదిలేశాను: ప్రధాని
జపాన్‌లో నవ్వాడు.. గోవాలో ఏడ్చాడు.. ఇదీ ప్రధాని తీరు: రాహుల్‌
ఇది భావోద్వేగ బ్లాక్‌మెయిలింగ్‌: కేజ్రీవాల్‌, మాయావతి, రాజా


‘‘పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతుండటం నిజమే. ఇది నన్ను కూడా కలచి వేస్తోంది. నాకూ బాధగానే ఉంది. అయితే ఇది నేను అహంకారంతో తీసుకున్న నిర్ణయంగా భావించకండి. ఇలాంటి ఇబ్బందులు డిసెంబరు 30 వరకే. ఆ తర్వాత అంతకంటే ఎక్కువే లబ్ధి చేకూరుతుంది. ఒక్కసారి ‘ప్రక్షాళన’ ముగిసిందంటే... చిన్న దోమ కూడా ఉండదు! ఐదొందల నోటును మూడొందలకో, ఇంకా తక్కువకో మార్చుకోవద్దు. అది మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. నోట్ల రద్దుపై సామాన్యులకు భయాందోళనలు వద్దు.’’


పణాజీ/బెలగావి, నవంబరు 13: ‘‘ఇది అంతం కాదు... ఆరంభమే! 70 ఏళ్ల అవినీతి చరిత్ర మొత్తం బయటికి తీస్తా! ఎవ్వరినీ వదిలేది లేదు! ఇంతటితో ఆగేదీ లేదు. మున్ముందు ఇంకా ఇలాంటి చర్యలు చాలానే ఉంటాయి’’... ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విస్పష్టమైన ప్రకటన! పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన విరుచుకుపడ్డారు. ఎవ్వరి పేరెత్తకుండానే... ఎవరిని ఉద్దేశించి అంటున్నదీ అందరికీ అర్థమయ్యేలా చురకలు అంటించారు. ఆవేశం, ఆగ్రహంతోపాటు పలుమార్లు తీవ్ర భావోద్వేగానికీ గురయ్యారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘డిసెంబరు 30వ తేదీ వరకు వేచి చూడండి. నా నిర్ణయం, నా చర్యల వెనుక దురుద్దేశం ఉందని భావిస్తే... నడి వీధిలో ఉరి తీయండి. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బంది నాకు తెలుసు. దయచేసి 50 రోజులపాటు నా కోసం, దేశం కోసం ఓపికపట్టండి. ఆ తర్వాత... ఈ ప్రక్షాళన ఫలితాలు మీకు లభిస్తాయి. మీరు కోరుతున్న భారతాన్ని మీకు అందిస్తాను’’ అని మోదీ ప్రకటించారు.

ఆదివారం ఆయన గోవాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన, కర్ణాటకలోని బెళగావిలో కర్ణాటక లింగాయత విద్యా సంస్థ వందేళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. రెండు చోట్లా నోట్ల రద్దు గురించి ప్రస్తావించారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బ్యాంకులో క్యూలో నిలబడి నాలుగు వేలు తీసుకున్న సంగతిని పరోక్షంగా గుర్తు చేస్తూ... ‘‘బొగ్గు స్కామ్‌, 2జీ స్కామ్‌లాంటి భారీ కుంభకోణాల్లో ప్రమేయమున్న వారు నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిల్చున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘‘కొన్ని శక్తులు నన్ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయని తెలుసు. ఎందుకంటే, 70 ఏళ్లపాటు వాళ్లు దోచుకున్న సొమ్ముకు ఇప్పుడు ముప్పు వచ్చి పడింది. వాళ్లు నన్ను ప్రాణాలతో ఉండనివ్వక పోవచ్చు. ఏం జరిగినా సరే, ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. ప్రియమైన ప్రజలారా... నేనేం ఉన్నత పదవులు అలంకరించేందుకు పుట్టలేదు. ఈ దేశం కోసం నా ఊరిని, నా కుటుంబాన్ని, నా సర్వస్వాన్ని త్యాగం చేశాను’’ అని తీవ్ర భావోద్వేగంతో అన్నారు.

కొన్ని లక్షల మంది అవినీతి పరులు మినహా... మిగిలిన దేశవాసులంతా తన పోరాటాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ‘‘నిజాయితీపరులను ఇబ్బందిపెట్టం. అదే సమయంలో... అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదు. ఇది 70 ఏళ్లుగా ఉన్న జబ్బు. దీనిని నయం చేసేందుకు 17 నెలలుగా ప్రయత్నిస్తున్నాం. 70 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్నారు. ఇన్నేళ్లపాటు మీరు దోపిడీదారులను చూశారు. దీనిని చక్కదిద్దేందుకు 70 నెలలు సమయం ఇవ్వండి. మొత్తం అవినీతి చరిత్రను వెలికి తీస్తా. దీనికోసం లక్ష మంది యువతను నియమించాల్సి వచ్చినా వెనక్కి తగ్గను. పెద్దనోట్ల రద్దు అనేది మొదటి అడుగు మాత్రమే. అది అంతం కాదు... ఆరంభం. నన్ను గట్టిగా నిలదీస్తే మౌనంగా ఉంటానని భావిస్తున్నారు. కానీ... నన్ను సజీవంగా దహనం చేసినా సరే... భయపడను. దీనిని వదిలిపెట్టేది లేదు. దేశాన్ని అవినీతి రహితం చేసేందుకు ఇంకా చాలా ప్రాజెక్టులున్నాయి. బినామీ ఆస్తులపైనా చర్యలు తీసుకుంటాం. దేశంలో దోపిడీకి గురైన, దేశం సరిహద్దులు దాటి వెళ్లిన సొమ్ము మొత్తం రాబట్టి తీరుతాం.

ఇది మా బాధ్యత’’ అని ఉద్ఘాటించారు. ఇప్పటికైనా కట్టలు కట్టలుగా సొమ్ములు దాచుకున్న వారు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. ‘‘ఇప్పటికీ ఇంకా వేచి చూద్దాం అని అనుకునే వాళ్లకు నా గురించి తెలియదు’’ అని హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దు పర్రీకర్‌ చేసిన దాడి (పాక్‌పై చేసిన సర్జికల్‌ ఎటాక్‌)లాంటిది కాదని మోదీ చెప్పారు. ‘పది నెలల కిందట చిన్న టీమ్‌తో ఈ సీక్రెట్‌ ఆపరేషన్‌ మొదలైంది’ అని తెలిపారు. కొత్త నోట్ల ముద్రణకు, ఇతర చర్యలకు చాలా కసరత్తు జరిగిందని తెలిపారు. అదే సమయంలో... ఈ మొత్తం ప్రక్రియను గోప్యంగా ఉంచామని, లేకపోతే అవినీతిపరులు అప్రమత్తమయ్యే వారని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ పావలా నాణేల రద్దుతో సరిపెట్టిందని, వాళ్ల సత్తా అక్కడికే పరిమితమని ఎద్దేవా చేశారు. ‘500, వెయ్యి నోట్లు ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్‌ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మీరు పావలా నాణేలు రద్దు చేసినప్పుడు మేం ఏమైనా అన్నామా?’ అని ప్రశ్నించారు.
జనం అడిగిందే చేస్తున్నాం

‘‘అవినీతిపై దేశం విసిగి వేసారిపోయింది. 2014 ఎన్నికల్లో జనం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నారు. ఈ దేశ ప్రజలు నన్ను ఏం అడిగారో, అదే చేస్తున్నాను’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నల్లధనంపై యుద్ధం ఈ రోజు, హఠాత్తుగా మొదలైనది కాదని తెలిపారు. ‘‘నేను ఏదీ రహస్యంగా ఉంచలేదు. ప్రజల వద్ద ఏదీ దాచలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పావలా నాణెం రద్దుతో సరిపెట్టిందని... మాకేగనక అధికారమిస్తే వెయ్యి నోట్లు రద్దు చేస్తామని చాలా ఏళ్ల క్రితమే ఓ బహిరంగ సభలో ప్రకటించాను. నల్లధనంపై సిట్‌ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలోనే ఈ విషయాన్ని చెప్పాను. అధికారంలోకి వచ్చీ రాగానే... నల్లధనంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పని చేసే సిట్‌ ఏర్పాటు చేశాం. విదేశాల్లో దాచిన నల్లధనం గుట్టు రట్టు చేయాలని ఆదేశించాం.

గత ప్రభుత్వాలు ఈ పని చేయలేదు’’ అని విమర్శించారు. లంచాల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకే కీలకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘ఆదాయ వెల్లడి పథకం ద్వారా 67 వేల కోట్లు రాబట్టాం. అదే సమయంలో... గత రెండేళ్లలో సోదాలు, సర్వేలు, డిక్లరేషన్ల రూపంలో ప్రభుత్వం 1.25 లక్షల కోట్లు ఖజానాకు జమ చేయగలిగింది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు చిన్న చిన్న డోస్‌లలో ఔషధాన్ని ఇస్తూ వస్తున్నాం’’ అని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులపై బడ్జెట్‌లోనే పన్ను తీసేశామని గుర్తు చేశారు. దేశంలో ఉప్పునకు కొరత ఏర్పడిందన వదంతులపై స్పందిస్తూ... ‘ఇది నల్లధనం పోగొట్టుకుంటున్న వారి పనే’ అని వ్యాఖ్యానించారు.
మోదీ మాట
గంగా నదిలో పుణ్యం కోసం పావలా వేసే వారు... ఇప్పుడు నోట్ల కట్టలు వేస్తున్నారు. ముసలి తల్లి బాగోగులను ఎప్పుడూ పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఆమె ఖాతాలో రెండున్నర లక్షలు జమ చేస్తున్నారు! నల్లధనంపై నా పోరాటానికి మాతృమూర్తుల ఆశీర్వాదముంది. సామాన్యుల ప్రార్థనలున్నాయి. నా ప్రయత్నం విజయానికి ఇవే దోహద పడతాయి.
నగల వ్యాపారులను ఐటీ అధికారులు వేధిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. నేను హామీ ఇస్తున్నా! నగల వర్తకులను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే... మా దృష్టికి తీసుకురండి. కఠిన చర్యలు తీసుకుంటాం!
నగల కొనుగోలుకు ‘పాన్‌’ తప్పనిసరి చేయవద్దని చాలా మంది ఎంపీలు నన్ను అడిగారు. కొందరు లిఖితపూర్వకంగానే కోరారు. ఆ లేఖలను బయటపెట్టిన రోజున... వారు తమ నియోజకవర్గాల్లో తిరగలేరు.
బ్యాంకు సిబ్బందికి నా అభినందనలు. ఏడాదిలో చేసేంత పనిని వారు పది రోజుల్లో చేశారు.
- ప్రధాని నరేంద్ర మోదీ

కోట్లు మింగి వేల కోసం క్యూలో!
రూ.నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు రాహుల్‌ గాంధీ ఇటీవల పార్లమెంటు హౌస్‌లోని బ్యాంకులో క్యూలో నిల్చున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘భారీ కుంభకోణాల్లో ప్రమేయమున్న వారు నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిల్చున్నారు. 500, వెయ్యి నోట్లు ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్‌ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మీరు పావలా నాణేలు రద్దు చేసినప్పుడు మేం ఏమైనా అన్నామా?’’ అని ప్రశ్నించారు.

యుద్ధమంటే మాటలు కాదు!
‘‘ఈ మధ్య ఓ పాత్రికేయుడు నన్ను కలిశారు. యుద్ధం చేద్దామన్నారు. యుద్ధం వల్ల తలెత్తే సమస్యలకు మీ వద్ద పరిష్కారం ఉందా అని నేను ఆయనను ప్రశ్నించాను. సమరంతో విద్యుత్తు ఆగిపోతుంది. సరుకుల సరఫరా నిలిచిపోతుంది. రైళ్లల రద్దవుతాయి. సూచనలు, సలహాలుఇవ్వడం సులభమే. కానీ... మనం తీసుకున్న నిర్ణయాలు సామాన్యుడిని ఇబ్బంది పెట్టవద్దు.’’



‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు రాత్రి కోట్ల మంది ప్రజలు సుఖంగా నిద్రించారు. కానీ, కొన్ని లక్షల మంది అవినీతిపరులకు మాత్రం నిద్ర రాలేదు. వాళ్లంతా నిద్రమాత్రలు వాడాల్సి వచ్చింది.’’

- ప్రధాని మోదీ

ఫ్రీగా ఫోన్లు!

పెద్ద నోట్ల రద్దు ప్రభావం మొబైల్ ఫోన్ రిటైలర్ల‌పైనా పడింది. ప్రజలు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ములను వ్యక్తిగత అవసరాల కోసం వారివద్దే అట్టిపెట్టుకోవడంతో మొబైల్ ఫోన్లు కొనేవారే కరువయ్యారు. వారం రోజులుగా అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు మొబైల్ వ్యాపారులు జీరో డౌన్‌పేమెంట్ ఆఫర్లు మొదలు పెట్టారు. ఈ ఆఫర్‌తో వారం రోజులగా ఏటీఎంల వద్ద దర్శనమిస్తున్న క్యూ లైన్లు ఇప్పుడు మొబైల్ షాపుల వద్ద కూడా కనిపిస్తున్నాయి. ‘‘శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ఆఫర్ ప్రారంభించాం. తర్వాత 12 నెలల పాటు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చుని చెబుతున్నాం’’ అని సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర పేర్కొన్నారు.

గీత మొబైల్స్‌కి దక్షిణాది రాష్ట్రాల్లో 300 పైగా మొబైల్ స్టోర్లు ఉన్నాయి. సాధారణంగా ఫోన్ ధరలో కొంత భాగం చెల్లించిన తరువాత మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా విడతల వారీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు రూపంలో చెల్లింపులు స్వీకరిస్తారు. అయితే దాదాపు 30 నుంచి 40 శాతం అమ్మకాలు నగదు రూపంలో జరుగుతుంటాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తగ్గటంతో ముందస్తు చెల్లింపులు లేకుండా రిటైలర్లు ఫోన్ల అమ్మకాలు చేపట్టారు. తాజా ఆఫర్‌తో అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయనీ... ఫోన్లు మొదలు పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని సతీష్ చంద్ర పేర్కొన్నారు.

రూ. 2000 కొత్త నోటును నీటిలో అరగంటపాటు తడిపితే ఏమయ్యిందో తెలుసా



పాత నోట్ల రద్దు ప్రకటన వెలువడగానే కొత్త నోట్లకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఏర్పడింది. కొత్త 2వేల నోటు చేతిలోకి రాగానే అంతా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొత్త నోట్ల నాణ్యత గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మరి ఈ కొత్త 2వేలు నోటును అరగంట పాటు నీటిలో నానబెడితే ఏం జరుగుతుంది. మెత్తబడిపోతుందా? నిలిపేస్తే చినుగుతుందా? నెట్‌లో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం అలా జరగలేదు అంతా బాగానే ఉంది. పై వీడియో చూడండి..