11/20/16

డబ్బు డిపాజిట్ చేస్తున్న వాళ్ళకి.... ఐటీవార్నింగ్



పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంక్‌ల్లో జరిగే డిపాజిట్లపై ఐటీ శాఖ నిఘా పెంచింది. దీనిలో భాగంగా రూ. 2.5 లక్షలకుపైబడి అకౌంట్లలో డిపాజిట్‌ చేసినవారి వివరాలు పంపాలని బ్యాంకర్లకు లేఖలు పంపించింది. ఐటీ శాఖ ఆదేశంతో బ్యాంకర్లు డిపాజిట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతివారం వివరాలు పంపాలని కూడా బ్యాంకర్లను ఐటీశాఖ ఆదేశించింది. నోట్లమార్పిడి, డిపాజిట్ల సేకరణతో బీజీబిజీగా ఉండడం వల్ల ఇప్పటికిప్పుడు వివరాలు ఇవ్వలేమని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. ఐటీ శాక పంపించిన లేఖలు నిన్న సాయంత్రానికే బ్యాంకర్లకు చేరాయి.

No comments: